చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా..

Photo: AP

By Chatakonda Krishna Prakash
Apr 27, 2025

Hindustan Times
Telugu

ఐపీఎల్ 2025 సీజన్‍లో ముంబై ఇండియన్స్ మరోసారి అదరగొట్టింది. నేడు (ఏప్రిల్ 27) జరిగిన మ్యాచ్‍లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై 54 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా ఐపీఎల్‍లో నయా రికార్డు క్రియేట్ చేసింది ముంబై. 

Photo: PTI

ఐపీఎల్‍లో 150 మ్యాచ్‍ల్లో గెలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి వరకు 271 మ్యాచ్‍లు ఆడిన ముంబై 150 విజయాలు సాధించింది. లక్నోతో మ్యాచ్‍లో గెలుపుతో ఈ రికార్డుకు చేరింది హార్దిక్ సారథ్యంలోని ముంబై. 

Photo: PTI

ఐపీఎల్‍లో 150 విజయాలు సాధించిన తొలి జట్టుగా ఘనత సాధించింది ముంబై ఇండియన్స్. ఇప్పటి వరకు 140 విజయాలతో ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ (248 మ్యాచ్‍లు) రెండో స్థానంలో ఉంది. 

Photo: PTI

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 134 మ్యాచ్‍ల్లో గెలిచిన కోల్‍కతా నైట్‍రైడర్స్ ఈ లిస్టులో మూడో ప్లేస్‍లో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (129 విజయాలు), ఢిల్లీ క్యాపిటల్స్ (121) వరుసగా నాలుగు, ఐదు ప్లేస్‍ల్లో ఉన్నాయి. 

Photo: PTI

ఐపీఎల్‍లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఐదుసార్లు టైటిల్ సాధించింది. అత్యధిక ఐపీఎల్ టైటిళ్లు దక్కించుకున్న జట్టుగా చెన్నైతో పాటు ముంబై కూడా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు తలా ఐదుసార్లు విజేతగా నిలిచాయి. 

Photo: PTI

నేటి ఐపీఎల్ 2025 మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 215 రన్స్ చేసింది. లక్నో 161 పరుగులకు ఆలౌటైంది. వరుసగా ఐదో గెలుపుతో సత్తాచాటింది ముంబై.

Photo: ANI

మ్యాక్సీ డ్రెస్‍లో ప్రగ్యా జైస్వాల్ హాట్ షో.. అదిరే పోజులు

Photo: Instagram