ఏపీ డిఎస్సీ 2025కి ఇలా దరఖాస్తు చేయండి ఇలా...

By Sarath Chandra.B
Apr 21, 2025

Hindustan Times
Telugu

డిఎస్సీ 2025కు దరఖాస్తు చేసే ముందు అభ్యర్థి వివరాలతో రిజిస్ట్రేషన్‌  చేయాల్సి ఉంటుంది. 

రిజిస్ట్రేషన్‌ పూర్తైన తర్వాత  దరఖాస్తు నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 

అభ్యర్థి స్థానికతను నిర్ధారించాల్సి ఉంటుంది. 

డిఎస్సీ నియామక ప్రక్రియలో భాగంగా రెగ్యులర్‌, ప్రైవేట్‌ అభ్యర్థులు స్థానికత కోసం ప్రాథమిక విద్యాభ్యాసం వివరాలను తెలియచేయాలి.

అభ్యర్థి ప్రాథమిక డిగ్రీ విద్యార్హత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. 

డిఎస్సీకు హాజరయ్యే అభ్యర్థులు టెట్‌  అర్హత మార్కుల వివరాలను నమోదు చేయాలి.

అభ్యర్థి బిఇడి పూర్తి చేస్తే ఆ వివరాలను నమోదు, యూనివర్శిటీ వివరాలను నమోదు చేయాలి.

అభ్యర్థి ప్రాథమిక డిగ్రీ ఆధారంగా ఏ సబ్జెక్టులో పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హత ఉందో జాబితా కనిపిస్తుంది. 

సబ్జెక్టు వారీగా ఏ జిల్లాలో ఖాళీలు ఉన్నాయో జిల్లాలు, జోన్ల వారీగా సమాచారం తెలుస్తుంది. 

అందుబాటులో ఉన్న ఖాళీలను ఆధారంగా ఏ సబ్జెక్టుల్లో పరీక్ష రాయాలో నిర్ణయించుకుంటే దాని ప్రకారం చెల్లించాల్సిన ఫీజు వివరాలు కనిపిస్తాయి. 

ఫీజు చెల్లించే ముందు పరీక్ష కేంద్రాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. 

పరీక్షా కేంద్రాలను నిర్ణయించుకునన తర్వాత ఫీజు చెల్లించడానికి విండో ఓపెన్ అవుతుంది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

ఫీజు  చెల్లించిన తర్వాత అభ్యర్థి దరఖాస్తులో పేర్కొన్న విధంగా విద్యార్హతలు, రిజర్వేషన్, స్థానికతకు సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 

డిఎస్సీ 2025 దరఖాస్తుదారులు ముందే అన్ని డాక్యుమెంట్స్‌  సమర్పించాల్సి ఉంటుంది. 

మ్యాక్సీ డ్రెస్‍లో ప్రగ్యా జైస్వాల్ హాట్ షో.. అదిరే పోజులు

Photo: Instagram