విజయవాడ టు షిర్డీ ట్రిప్ - మే నెలలో జర్నీ, ఇదిగో ప్యాకేజీ

By Maheshwaram Mahendra Chary
Apr 25, 2025

Hindustan Times
Telugu

వచ్చే మే నెలలో షిర్డీ  ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? అయితే మీకోసం IRCTC టూరిజం ప్యాకేజీని తీసుకువచ్చింది. 

ఈ షిర్డీ టూర్ ప్యాకేజీని విజయవాడ నుంచి ఆపరేట్ చేస్తారు . IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవాలి.

విజయవాడ - షిర్డీ ట్రిప్ మే 6, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ డేట్ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. 

ఐఆర్ సీటీసీ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే “SAI SANNIDHI EX VIJAYAWADA” పేరుతో ఈ ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది. ఇది మొత్తం 4 రోజుల టూర్ ప్యాకేజీ. ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.

టికెట్లు బుకింగ్ చేసుకున్న వాళ్లు కేవలం విజయవాడలోనే కాకుండా.. ఖమ్మం, సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్ రైల్వే స్టేషన్లల్లో కూడా రైలు ఎక్కే అవకాశం ఉంటుంది.

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా షిర్డీలోని సాయిబాబాను దర్శించుకుంటారు. శనిశిగ్నాపూర్ కు కూడా వెళ్తారు. 

విజయవాడ - షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు : కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 16,150గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10,100, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8520 చెల్లించాలి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు 6180గా ధర ఉంది. సింగిల్ షేరింగ్ కు రూ. 7760, డబుల్ షేరింగ్ కు రూ. 7760గా నిర్ణయించారు. 

30ఏళ్ల వయసులో కెరీర్‌ను ఎలా మలుచుకోవాలి? ఈ వయసులో వచ్చే అత్యంత ముఖ్యమైన మార్పులు ఏమిటి?

Photo Credit: Pexels