శరీరంలోని మలినాలను బయటకు పంపించే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఓ పరిమిత మొత్తంలో నీళ్లు తాగాలన్న విషయం మీకు తెలుసా?
pexels
By Hari Prasad S May 09, 2025
Hindustan Times Telugu
రోజుకు తగినంత నీళ్లు తాగితేనే కిడ్నీలు మలినాలను తొలగించి, శరీరంలో ద్రవాల స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది
pexels
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఓ ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 2 నుంచి 3 లీటర్లు అంటే 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలి.
pexels
అలా చేయడం వల్ల మూత్రం ద్వారా శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల కిడ్నీ స్టోన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గుతుంది
pexels
ముదురు పసుపు పచ్చ రంగు మూత్రం, చాలా తక్కువగా మూత్రానికి వెళ్లడం, నోరు పొడిబారడం, అలసట మీరు డీహైడ్రేషన్కు గురయ్యారన్నదానికి సంకేతాలు
pexels
ఆరోగ్యకరమైన మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. రోజుకు కనీసం ఆరు నుంచి 8 సార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం ఆరోగ్యకరం.
pexels
నీళ్లు మరీ ఎక్కువగా తాగినా ప్రమాదమే. అంటే రోజుకు 4 లేదా 5 లీటర్లకు మించి నీళ్లు తాగితే శరీరంలోని ముఖ్యమైన ఖనిజాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. కిడ్నీలపై భారం కూడా పెరుగుతుంది
pexels
కిడ్నీల కోసం రోజూ కేవలం మంచి నీళ్లే ఎక్కువగా తాగడం మంచిది. షుగర్ ఎక్కువగా ఉన్న డ్రింక్స్, ఆల్కహాల్, అతిగా కెఫీన్ తీసుకోవడం కిడ్నీలను దెబ్బ తీస్తుంది