మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆహారంలో ఏదైనా మార్పు ఉంటే, అది రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది.
అల్పాహారంలో తినే చట్నీలు కూడా ఆరోగ్యకరమైనవే ఎంచుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు చట్నీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
పుల్లని, తీపి లేదా స్పైసీ చట్నీ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ఖాయం. కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొన్ని చట్నీలు మాత్రమే సరిపోతాయి.
కొంతమంది పంచదార కలిపిన చట్నీ తింటారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు తీపిగా ఉండే చట్నీలను తినకూడదు.
చట్నీ తయారు చేసేటప్పుడు ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను అధికంగా వాడాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఫైబర్ ఎంతో మేలు చేస్తుంది. ఇది పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది . రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నివారిస్తుంది. ఉదాహరణకు మెంతులు, కొత్తిమీర వాడండి.
చట్నీ చేసేటప్పుడు పంచదార మాదిరిగానే ఉప్పును తక్కువగా వాడండి. ఇది రుచికరంగా ఉన్నప్పటికీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు. చట్నీలో ఉప్పును మితంగా వాడితే ఎంతో మేలు జరుగుతుంది.
చట్నీ ఎంత ఆరోగ్యకరమైనదైనా మితంగా తినకపోతే ప్రయోజనం ఉండదు. అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. చట్నీలో కార్బోహైడ్రేట్లు, చక్కెర ఉంటాయి. కాబట్టి మితంగా వాడటం మంచిది.
కొత్తిమీర, పుదీనా పచ్చడి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే ఈ రెండు రకాల చట్నీలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
కాబట్టి మధుమేహాన్ని నియంత్రించాలనుకునేవారు కొత్తిమీర, పుదీనా పచ్చడిని తినేందుకు ప్రయత్నించాలి.
కచోరీలు, సమోసాలు, పకోడీలతో ఇచ్చే చట్నీలను కూడా తినకూడదు. వాటిలో తీపి రుచి కోసం చక్కెరను వాడతారు.
సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త