మీ చర్మాన్ని ప్రకాశవంతంగా, అందంగా ఉంచుకోవాలంటే చర్మాన్ని క్రమం తప్పకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

Unsplash

By Anand Sai
Jun 07, 2025

Hindustan Times
Telugu

చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన పెద్దలు శనగపిండి, పసుపుతో ఏమి కలిపి అప్లై చేసేవారో చూద్దాం..

Unsplash

పెరుగుతో పాటు శనగపిండి, పసుపుతో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల శనగ పిండిని తీసుకుని, దానికి 2 టేబుల్ స్పూన్ల పెరుగు, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ముఖానికి పెట్టుకోవాలి.

Unsplash

తేలికపాటి చేతులతో వృత్తాకార కదలికలలో మసాజ్ చేయండి. సుమారు 10-15 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని నీటితో కడగాలి. ఇది మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.

Unsplash

మీ ముఖం కోసం శనగపిండి, పసుపుతో కలబంద జెల్‌ను కూడా ప్రయత్నించవచ్చు. ఇది టానింగ్‌ను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

Unsplash

ఈ పేస్ట్ ముఖానికి అప్లై చేసి దాదాపు 10-15 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని నీటితో కడుక్కోండి. ఇది మీ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది.

Unsplash

పచ్చి పాలను పసుపు, శనగపిండితో కలిపి పేస్ట్ లా చేసి ముఖాన్ని శుభ్రపరచవచ్చు. చర్మపు మచ్చలను తొలగించి కాంతిని తెస్తుంది.

Unsplash

ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల పాలు, చిటికెడు పసుపు వేసి బాగా కలపి మీ ముఖానికి అప్లై చేసి ఆరనివ్వండి. తర్వాత కడుక్కోవాలి.

Unsplash

యోగాతో సయాటికా నొప్పి తగ్గుతుందా ..? వీటిని తెలుసుకోండి

image credit to unsplash