చియా గింజల నీళ్లతో బోలెడు ప్రయోజనాలు - ఈ విషయాలను తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Jul 03, 2024
Hindustan Times Telugu
ఉదయాన్నే ఓ గ్లాసుడు చల్లని నీటిలో రెండు స్పూన్ల చియా సీడ్స్ వేసి నానబెట్టిన నీటిని తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
image credit to unsplash
చియా గింజల నీటిని ఉదయం పూట తాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. చర్మం చికాగుగా, దురదగా అనిపించడం లాంటి సమస్యలు తగ్గిపోతాయి.
image credit to unsplash
చియా గింజలు వేసి నానబెట్టి తాగితే అద్బుత ఫలితం ఉంటుంది. శరరీ బరువు తగ్గటంలో సహాయపడుతుంది.
image credit to unsplash
చియా గింజల్లో క్లోరోజెనిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ నీటిని తాగటం వల్ల అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
image credit to unsplash
చియా గింజల్లో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి.
image credit to unsplash
చియా విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చియా గింజలు నానబెట్టిన నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే.. జీర్ణశక్తి పెరుగుతుంది, పేగు కదలికలను మెరుగుపరుస్తుంది.
image credit to unsplash
చియా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.