పుచ్చపండులాగానే ఖర్బుజాలో కూడా తేమ శాతం అధికంగా ఉంటుంది. ఇందులో నీటి శాతం (90-95%), ఫైబర్, విటమిన్ ఎ, సి, పొటాషియంతో సమృద్ధిగా ఉంటుంది.
ఖర్బుజా పండు జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది.
నాలుగు రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తినడం మానుకోవాలి -లేదా వైద్యుల సలహాతో తీసుకోవాలి.
కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఖర్బుజా మంచిది కాదు. అధిక ఫైబర్, ఫ్రక్టోస్, పొటాషియం సమస్యలను తీవ్రతరం చేయవచ్చు. మితంగా, పగటిపూట మాత్రమే తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఖర్బుజా సాధారణంగా జీర్ణక్రియకు సహాయపడతాయి. కానీ సున్నితమైన కడుపు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్), లేదా గ్యాస్ట్రైటిస్ వంటి దీర్ఘకాల జీర్ణ సమస్యలు ఉన్నవారికి దీనిలోని ఫైబర్ మరియు సహజ చక్కెరలు (ఫ్రక్టోస్) కడుపు ఉబ్బరం, గ్యాస్, లేదా అసౌకర్యాన్ని కలిగించవచ్చు.
ఖర్బుజాలో మధ్యస్థ గ్లైసెమిక్ ఇండెక్స్ (సుమారు 65) ఉంది, ఇది ఎక్కువ మొత్తంలో తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
మధుమేహం లేదా ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు దీనిని తక్కువ మొత్తంలో, తక్కువ గ్లైసెమిక్ ఆహారాలతో కలిపి తినాలి. వైద్యుడు లేదా డైటీషియన్
సలహా తీసుకోవడం మంచిది.
ఖర్బుజాలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది సాధారణంగా ఉపయోగకరమైనప్పటికీ, దీర్ఘకాల మూత్రపిండ వ్యాధి వంటి సమస్యలు ఉన్నవారికి హానికరం. అధిక పొటాషియం స్థాయిలు మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతాయి.
ఖర్బుజాను మితంగా, పగటిపూట తినడం మంచిది, రాత్రి తినడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు.
అలర్జీ లక్షణాలు ఉన్న వారికి ఖర్బుజా అసౌకర్యం కలిగిస్తుంది. ఓరల్ అలెర్జీ సిండ్రోమ్ కారణంగా నోటిలో దురద, వాపు, లేదా గొంతు చికాకు వంటి లక్షణాలు కనిపించవచ్చు.
అధిక యూరిక్ యాసిడ్ ఇటీవలి కాలంలో ఒక సాధారణ పరిస్థితి. కొన్నిసార్లు అది పెరిగితే ఇంటి నివారణలు లేదా చికిత్స అవసరం కావచ్చు.