ఇండియాలో వీటిని చూడకపోతే చాలా మిస్ అవుతారు

భారత్ లోని  అద్భుత పర్యాటక ప్రదేశాలు

PEXELS

By Sudarshan V
Apr 18, 2025

Hindustan Times
Telugu

భారతదేశంలో జనసమూహానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా, అన్వేషించదగిన గమ్యస్థానాలు చాలా ఉన్నాయి.

PINTEREST

మీ ట్రావెల్ లిస్ట్ లో కచ్చితంగా ఉండవలసిన అటువంటి అద్భుత ప్రదేశాల వివరాలు మీ కోసం..

PINTEREST

తోష్, హిమాచల్ ప్రదేశ్

పార్వతి లోయలోని ఈ గ్రామం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఇక్కడ మంచు శిఖరాలు, పైన్ అడవులు, నదులు ఉన్నాయి. ట్రెక్కింగ్, క్యాంపింగ్ లేదా సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడానికి ఇది ఒక గొప్ప గమ్యస్థానం.

PINTEREST

తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్

తవాంగ్ ఒక ప్రశాంతమైన, ఆధ్యాత్మిక గమ్యస్థానం, తవాంగ్ సరస్సులు, పర్వతాలకు నిలయం. ఇక్కడి గాలి శరీరాన్ని, మనసును ఉల్లాసపరుస్తుంది.

PINTEREST

మజులి ద్వీపం, అస్సాం

బ్రహ్మపుత్ర నదిలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపమైన మజులి, అస్సాం సంస్కృతి, పర్యావరణ పర్యాటకానికి ఒక ప్రత్యేకమైన గమ్యస్థానం.

PINTEREST

లుంగ్లేయి, మిజోరం

మిజోరాం లోని లుంగ్లేయి 'స్టోన్ బ్రిడ్జి'కి ప్రసిద్ధి చెందింది, ఇక్కడి పచ్చదనంలో ట్రెక్కింగ్ గొప్ప అనుభవం. అలాగే, మిజో సంస్కృతిని ఆస్వాదించవచ్చు.

PINTEREST

భింత్ గఢ్, రాజస్థాన్

జైపూర్, బికనీర్ మధ్య ఉన్న కోట ఇది. సాంస్కృతిక వారసత్వ కేంద్రం. దీనిని  సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి ఫిబ్రవరి.

PINTEREST

30ఏళ్ల వయసులో కెరీర్‌ను ఎలా మలుచుకోవాలి? ఈ వయసులో వచ్చే అత్యంత ముఖ్యమైన మార్పులు ఏమిటి?

Photo Credit: Pexels