మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అమానవీయ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. మరోవైపు... ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి ఇంటికి మహిళలు నిప్పు పెట్టారు. అటు ఈ ఘటనకు సంబంధించి పలుచోట్ల ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. మరోసారి ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ లోనూ దీనిపై చర్చకు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకు మోదీ ప్రభుత్వం చర్చకు ముందుకు రావటం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.