కేరళలో భారీ వర్షాల కారణంగా వయనాడ్లో చోటు చేసుకున్న ప్రళయం అంతా ఇంతా కాదు. వందల మందిని ప్రజలను పొట్టనబెట్టుకుంది. అధికారిక లెక్కల ప్రకారం 160 మందికిపైగా మృతి చెందినట్లు చెబుతున్నా.. ఆ లెక్క రెండింతలు ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికీ ఇంకా కొండ చరియల్లో కనిపించకుండా చాలా మంది పోయారు. వారి కోసం అన్వేషణ సాగుతోంది. అందుకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ డ్రోన్ విజువల్స్ లో చూడవచ్చు. ఆ ప్రాంతంలో ఎంతటి భీతావసం ఉందో కూడా అర్ధం అవుతోంది