మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డావంటూ కరీంనగర్ కు చెందిన సింగర్ చిలువేరి శ్రీకాంత్ కు గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ కాల్ చేశారు. సీబీఐ, ఈడీ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. శ్రీకాంత్ ఆధార్ కార్డు నంబర్ తో సీబీఐ, ఈడీ, సుప్రీంకోర్టు పేరుతో ఫేక్ లెటర్లు పంపించారు. నిజమేనని కాసేపు శ్రీకాంత్ నమ్మారు. మహారాష్ట్ర పోలీస్ ఆఫీసర్, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ పేరుతోనూ ఓ లెటర్ కూడా పంపారు. ఆ తరువాత రెండు గంటలపాటు తరచూ వీడియో కాల్స్ చేసి బెదిరించారు. చివరకు ఈ కేసు నుంచి బయటపడాలంటే రూ.3 లక్షలు ఇస్తే వదిలేస్తామన్నారు. ఇదంతా ఫ్రాడ్ అని భావించిన బాధితుడు చిలువేరి.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.