హైదరాబాద్ లోని TSPSC కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి చోటు నెలకొంది. గ్రూప్ 2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్పీఎస్సీ దగ్గర వేలాది మంది అభ్యర్థులు బైఠాయించారు. వరుస ఎగ్జామ్స్ నేపథ్యంలో తమకి ప్రిపరేషన్కి సమయం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు పలు విద్యార్థి సంఘాలు సైతం మద్దతు తెలిపాయి. అభ్యర్థులకు మద్దతుగా నిరసనలో ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.