వక్ఫ్ సవరణల చట్టానికి రాజ్యాంగ బద్ధత ఉందా అని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్స్ పై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. పిటిషనర్స్ తరపు న్యాయవాదులు, ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనలు విన్న సుప్రీం కోర్టు, పిటిషనర్స్ లేవనెత్తిన అభ్యంతరాలపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. వక్ఫ్ సవరణల చట్టం బిల్లు దశలో ఉన్నప్పటి నుంచే మేం వ్యతిరేకిస్తున్నామని అసదుద్దీన్ అన్నారు. ఈ చట్టం వల్ల జరిగే నష్టాలను జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఇచ్చిన నివేదికలోనూ చెప్పామన్నారు.