తమ పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని విద్యార్థులు రోడ్డు ఎక్కిన ఘటన ఆసిఫాబాద్లో చోటుచేసుకుంది. తమకు టీచర్లు కావాలని వెంటనే ప్రభుత్వం ఆ పాయింట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయులు లేక, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరిది బాధ్యత అని విద్యార్థినిలు ప్రశ్నించారు. ఆదర్శ పాఠశాల నుంచి 17 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా, ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే వచ్చారని విద్యార్థులు ఆరోపించారు.