ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మహిళా బిల్లుకు ఆమోదం తెలిపింది. పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు సీట్లు మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేయాలి. 33 శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్లకు సబ్-రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదించింది. ఇక ఈ బిల్లు తీసుకురావటంతో దేశవ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు MLC కల్వకుంట్లు కవిత ఇంటి వద్ద పెద్ద ఎత్తున మహిళలు చేరి, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజాగాయని విజయక్క మహిళలపై పాట పాడి కవితకు వినిపించారు.