తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్నటి గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారుపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేల్చుతున్నారు. గవర్నర్ ప్రసంగం పై బర్రెల కథను ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చెప్పారు. రైతు రుణమాఫీ సహా ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చారని ప్రశ్నించారు.