72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ పోటీలకు 120 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇప్పటికే పలు దేశాల సుందరీమణులు నగరానికి వచ్చేశారు. వారికి తెలుగు సంప్రదాయంలో మహిళలు స్వాగతం పలికారు. ఇక రహదారులు, కూడళ్లు, పర్యాటక కేంద్రాలు, ముఖ్యమైన భవనాలను అందంగా జీహెచ్ఎంసీ తీర్చిదిద్దింది. కూడళ్ల సుందరీకరణ, పచ్చదనం ఏర్పాట్లు సైతం అద్భుతంగా చేసింది.