ఉచిత విద్యుత్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు వెళ్లిపోయినా ఆయన నీడలు తెలంగాణలో మిగిలే ఉన్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. రేవంత్ ఉచిత విద్యుత్పై మాట్లాడిన మాటలు రైతులపై పిడుగుపాటు లాంటివేనని అన్నారు.