సీఎం కేసీఆర్ కిట్లు ఇస్తే ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు తప్ప ఏమీ జరగలేదన్నారు. గోదావరి, కృష్ణా జలాలను తీసుకొచ్చి హైదరాబాద్లో తాగునీటి కొరతను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. పేదలందరికీ ఉచితంగా మంచినీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని కొల్లూరులో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇళ్లు కట్టడం అంటే అప్పుల్లో కూరుకుపోవడమే అన్నట్లుగా ఉండేదన్నారు హరీష్ రావు. ఎన్ని డిక్లరేషన్లు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.