హైదరాబాదులో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో తనిఖీలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. రైలు ప్రయాణికులు దాడి చేసి దోపిడి చేస్తున్నారనే సమాచారంపై పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. ఈ సందర్భంలోనే పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నించారు. ఆత్మ రక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరిపారు. ఇందులో ఓ వ్యక్తి గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.