జపాన్ కు చెందిన ప్రముఖ కంపెనీ మారుబెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. దాదాపు వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. దశలవారీగా 6 వందల ఎకరాల్లో పార్క్ ను అభివృద్ధి కానుంది. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందాన్ని టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు కలిశారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. ఇరువైపులా ప్రతినిధులు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేసుకున్నారు.