తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కరీంనగర్ లో పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతుబంధు పడలేదని అడిగితే చెప్పుతో కొడతారా? అని ప్రశ్నించారు. ఇంత అహంకారమా? అని కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. రైతుబంధు ఇవ్వలేని కాంగ్రెస్ నాయకులను ఏ చెప్పుతో కొట్టాలని మండిపడ్డారు.