ఢిల్లీలో టీఆర్ఎస్ నిర్వహించిన మహాధర్నాలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల ఆల్టిమేటం ఇచ్చారు. తెలంగాణలో పండే వరి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసే నిర్ణయాన్ని 24 గంటల్లోగా చేయాలని, లేదంటే కేంద్రం వెంట పడతామని, దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని కేసీఆర్ అన్నారు. రైతులతో చెలగాటం ఆడొద్దని, వారి సెంటిమెంట్లను గాయపరచొద్దని వ్యాఖ్యానించారు.