తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 18 ఏళ్లు నిండిన అందరూ తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటున్నారు. టాలీవుడ్ ప్రముఖలు సైతం తెల్లవారుజామునే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు వేశారు. ఓటు వేసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కీరవాణి, సుమంత్ ఉన్నారు. ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కుని ఉపయోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు ఉపయోగిస్తేనే మంచి నాయకుడు వస్తారని డైరెక్టర్ తేజ అన్నారు. ఓటు వేయకుండా మాట్లాడే వారు, మెుదట ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.