హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్-ED చర్యలను నిరసిస్తూ ఈ ధర్నా చేశారు. ఇక్కడే మాట్లాడిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్.. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.