మావోయిస్టులతో శాంతి చర్చల దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో సీఎం చర్చించారు. ఆదివారం సీఎం రేవంత్తో శాంతి చర్చల కమిటీ తెలంగాణ నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాల్పుల విరమణ, శాంతి చర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటామని సీఎం తెలిపారు. అందులో భాగంగానే ఇవాళ సీఎం.. జానా రెడ్డి ఇంటికి వెళ్లారు.