తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వస్తున్న ఆదాయం.. పథకాలు, ప్రభుత్వ నిర్వహణకు సరిపోతుందని అన్నారు. ఇంకేమైనా చేయలన్నా.. పైసా కూడా బయట అప్పు పుడత లేదని చెప్పారు. అణాపైసా ఎవడూ ఇస్తలేరన్న రేవంత్.. తెలంగాణ ప్రతినిధులను బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారని వాపోయారు. పలు సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగులకు సీఎం బహిరంగంగా ఆర్థిక పరిస్థితిని వివరించారు.