తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కూల్ ఈజ్ మై బ్రాండ్ అన్నారు. కొందరు తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంజనీరింగ్ కళాశాలాల్లో నాణ్యత లేదన్న సీఎం.. బీటెక్ చదివి అప్లికేషన్ నింపలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.