ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి రెండు వారాలైనా లోపల చిక్కుకున్న కార్మికుల జాడ ఇప్పటివరకు తెలియలేదు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ రెస్క్యూ బృందాలను నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంటకు రప్పించి ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం దోమలపెంటకు వచ్చింది. టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ నుంచి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్ను రప్పించారు.