అప్పు కోసం పోతే తెలంగాణ ప్రతినిధులను దొంగని చూసినట్టు చూస్తున్నారని ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకు పోతాడేమో అని అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని వాపోయారు. ఉద్యోగ సంఘాలు కోసుకొని తిన్నా.. తన దగ్గర పైసలు లేవన్నారు రేవంత్. ఇక ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అందాల పోటీలకు 250 కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి కదా అని ప్రశ్నించారు. మరీ రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని నిలదీశారు. రేవంత్ ని కోసుకొని తినడం కాదు.. ఆయనే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నారని మండిపడ్డారు.