బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు, కార్యకర్తలకు మధ్య వారధి తానేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఏ సమస్య ఉన్నా తనకి చెప్పాలని ఆ విషయం.. కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు రోజులు సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్సీ కవిత.. భద్రాచలం ఆలయంలో సీతారాములను దర్శించుకున్నారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమైన.. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. పార్టీ రజతోత్సవ బహిరంగ సభ విజయవంతం చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.