కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు పదవి లేకుండా ఉన్న నువ్వెలా దేవాదుల సృష్టికర్త అవుతావు అని ప్రశ్నించారు. కడియం టీడీపీలో ఉండగా తెలంగాణ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదన్నారు. కేసీఆర్ దయతలచి పార్టీలో చేర్చుకుంటే... వెన్నుపోటు పొడిచి పార్టీ మారావని మండిపడ్డారు.