అప్పు కోసం పోతే తెలంగాణ ప్రతినిధులను దొంగని చూసినట్టు చూస్తున్నారని ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకు పోతాడేమో అని అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు ఆయన వాపోయారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో ఇప్పుడు చెప్పులు ఎత్తుకుపోయే దాని మీద చర్చ నడుస్తుందని కౌంటర్ ఇచ్చారు. చెప్పులు ఎత్తుకు పోవడం కాంగ్రెస్ పార్టీ కల్చర్ కావొచ్చని ఎద్దేవా చేశారు. చెప్పులు ఎత్తుకపోయేవాడి లాగా రేవంత్ రెడ్డిని ఎవరు చూశారని బండి సంజయ్ ప్రశ్నించారు.