బట్టతల మందు కోసం హైదరాబాద్ ఉప్పల్లో బాధితులు క్యూ కట్టారు. బాగాయత్లో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద వేలాది మంది బాధితులు బారులు తీరారు. 1000 పెట్టి బట్టతలకు బాధితులు మందు తీసుకుంటున్నారు. 300 ఎంట్రీ ఫీజు కాగా.. 700 ఆయిల్ ధర. అయితే ఈ వ్యవహారం పోలీసులకు చేరగా రంగంలోకి దిగి.. ఢిల్లీ నుంచి ఫ్రాంచైజ్ తీసుకొని బట్టతలకు ఆయిల్ ఇస్తామంటూ మోసానికి పాల్పడుతున్న హరీష్, వినోద్, రాజశేఖర్లను అదుపులోకి తీసుకున్నారు.