ఏపీలోని ప్రొద్దుటూరు డీఎస్పీ భావనపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. డీఎస్పీ లంచాలు తీసుకుంటున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉద్యోగంలోకి చేరి మూడు నెలలు గడవక ముందే లంచాలు హద్దులు దాటాయన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రతి వైన్ షాపు నుంచి మామూళ్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. డీఎస్పీ అవినీతిపై త్వరలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని వరదరాజుల రెడ్డి తెలిపారు.