ఎగువ ప్రాంతాల నుంచి గంట గంటకు కృష్ణా వరద ప్రవాహం పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. దీంతో మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి పది గేట్లు పది అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని వదిలారు. సాగర్కు 2,75,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.