ఏపీలోని విశాఖ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరగబోతుంది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు గురువారం ఉదయం సింహాచల అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ టీమిండియా బృందంతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు గౌరవ మర్యాదలతో ఆహ్వానం పలికారు. అనంతరం భారత క్రికెటర్లు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహా స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. వేద పండితులు ఆలయ అర్చకులు క్రికెటర్లకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.