తిరుమల శ్రీవారిని ఇండియన్ క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ దర్శించుకున్నారు. రాత్రి తిరుమలకు వచ్చిన వీరు ఇవాళ ఉదయం వీఐపీ విరామం సమయంలో స్వామి దర్శనం చేసుకున్నారు. వెంకన్న దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదంతోపాటు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు.భారత క్రికెటర్లకు టీటీడీ అధికారులు ప్రోటోకాల్ దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. దర్శనం అనంతరం ఆలయం బయటకు వచ్చిన రిషబ్ పంత్, అక్షర్ పటేల్ ను చూసిన అభిమానులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు.