ఛాంపియన్స్ ట్రోఫీలో 2025లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో టీమిండియా సూపర్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ఆదిలోనే కష్టాలు ఎదుర్కున్నా.. భారత జట్టు కోలుకొని నిలబడిన తీరు అద్భుతం. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ 4వ వికెట్కు జోడించిన 98 పరుగుల పార్ట్నర్షిప్తో పాటు, చివర్లో పాండ్యా ఆడిన 45 పరుగుల ఇన్నింగ్స్ భారత జట్టుకు మంచి స్కోర్ ఇచ్చింది. ఇక ఈ విజయంతో టీమిండియా మార్చి 4న తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఆస్ట్రేలియాను సెమీస్లోనే ఓడించేస్తే ఇక ఫైనల్లో టీమిండియా కూల్గా ఆడి కప్పు కొట్టడం ఖాయమని క్రికెట్ అభిమానులు కూడా భావిస్తున్నారు.