విశాఖపట్నం జ్ఞానాపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి ఘటన గురించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఏప్రిల్ 25న గాలి సోకిందని బాలికను చర్చికి.. తల్లి, అమ్మమ్మ తీసుకొచ్చారు. అయితే బాలిక పిచ్చి పట్టినట్లు కరుస్తుందని.. నోట్లో గుడ్డ కుక్కి, మూతికి బట్ట చుట్టి తల్లి, అమ్మమ్మ చంపేశారు. ఆ తర్వాత విషయం బయట పడుతుందని భయపడ్డ ఇద్దరూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.