పాకిస్తాన్ మరియు పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత సాయుధ దళాలు మే 07న 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించాయి. దీంతో భయాందోళనకు గురైన పాకిస్తాన్.. జమ్ము కాశ్మీర్పై మోర్టార్ షెల్స్ను ప్రయోగించి అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుంది. ప్రతీకారంగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్లోని లాహోర్ వైమానిక రక్షణ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. అప్పటికీ సర్దుమనగని పాకిస్తాన్.. 8 క్షిపణులను ప్రయోగించింది. వీటిని మన రక్షణ వ్యవస్థ తిప్పి కొట్టింది. ఇక భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలు మరింత పెరగటంతో ఆ దేశంలోని వాఘా పట్టణం సహా పలు గ్రామాల ప్రజలు భయ పడుతున్నారు. భారత ప్రతీకార చర్యల భయాల మధ్య ఊళ్లని ఖాళీ చేస్తున్నారు.