అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆయన సతీమణి ఉషా వాన్స్ ఢిల్లీకి చేరుకున్నారు. తమ పిల్లలతో కలిసి వచ్చిన వీరికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలికారు. వాన్స్ భారత్లో నాలుగు రోజుల పాటు పర్యటిస్తారు. అమెరికా సెకండ్ లేడీ హోదాలో స్వదేశానికి వచ్చిన తెలుగమ్మాయి ఉషా చిలుకూరి. తన ముగ్గురు పిల్లలతో కలిసి భారత్ చేరుకొని ఘన స్వాగతం దక్కింది. ఈ పర్యటనలో భాగంగా మన ప్రభుత్వంతో కీలక అంశాలపై చర్చలు జరుగుతాయి. అలాగే దేశంలోని పలు చారిత్రక ప్రదేశాలను జేడీ వాన్స్ కుటుంబ సభ్యులు సందర్శించనున్నారు.