అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం భారత్ పర్యటనలో భాగంగా జైపూర్ పర్యటనకు వెళ్లారు. సోమవారం ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయిన వాన్స్.. ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించారు. సాయంత్రం ప్రధాని మోదీతో జేడీ వాన్స్ దంపతులు భేటీ అయ్యారు. ఇక ఇవాళ రెండో రోజు తన భార్య ఉషా వాన్స్, ముగ్గురు పిల్లలతో కలిసి జైపూర్ లోని అంబర్ ఫోర్ట్ ను సందర్శించారు. ఆ కోట విశేషాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.