జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి మారణహోమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రదాడిని ట్రంప్ తీవ్రంగా ఖండించినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. మోదీకి ట్రంప్ ఫోన్ చేసిన విషయాన్ని విదేశీ వ్యవహరాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్లో పోస్టు చేశారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకురావడానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు.