జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన పర్యాటకుల మృత దేహాలకు నివాళులు అర్పించారు. అనంతరం వారి బంధువులతో మాట్లాడారు. ఈ క్రమంలోనే తీవ్రంగా రోదిస్తున్న బాధిత కుటుంబ సభ్యులకు ఓదార్చారు. ఫ్యామిలీ సభ్యులను కోల్పోయిన పిల్లలు ఏడుస్తుండగా అమిత్ షా భావోద్వేగానికి గురై వారి కన్నీళ్లు తూడ్చారు. దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకొని శిక్షిస్తామని హోం మంత్రి ధైర్యం చెప్పారు.