ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్ర స్థావరాలపై భారత రక్షణ దళాలు విరుచుకుపడ్డాయి. మొత్తంగా 9 ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది భారత్. ఈ దాడిలో 100 కు పైగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. దీనిపై రెండోసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ చర్య చాలా భయంకరమైందన్నారు. ఇరు దేశాలు 'టిట్ ఫర్ టాట్' చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇరు పక్షాలతో తనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయన్న ట్రంప్, ఇంతటితో దాడులు ఆపేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం తనకు చేతనైన సాయం చేస్తా అని ట్రంప్ వ్యాఖ్యానించారు.