కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్య కేసులో పలు కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనలో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రకాశ్ భార్య పల్లవిపైనే పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఘటనకు ముందు గూగుల్లో హత్య గురించి వివరాలను పల్లవి వెతికినట్లు తెలిసింది. ఎక్కడ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడో ఆమె తెలుసుకున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇక తానే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో పల్లవి అంగీకరించారు. అటు కోర్టులో ఆమెను హాజరు పరచగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. కూతురు కృతి పాత్రపైనా లోతుగా పోలీసులు విచారణ చేస్తున్నారు.