భారత పర్యటనలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం ఉంది. సోమవారం ఉదయం ఢిల్లీలో జేడీ వాన్స్ కుటుంబం దిగింది. ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి ప్రధాని మోదీని కలిశారు వాన్స్. 7 లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో వారికి మోదీ స్వాగతం పలికారు. వాన్స్ పిల్లలతో మోదీ ముచ్చటిస్తూ వారిని ప్రేమగా ఆడించారు. వాన్స్ పిల్లలతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.