ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ సోదరి రాఖీ కట్టనున్నారు.రక్షాబంధన్ను పురస్కరించుకుని పాకిస్థాన్కు చెందిన కమర్ మొహిసిన్ షేక్ ఏటా మోదీకి రాఖీ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి రాఖీ పండుగ సందర్భంగా ఈ నెల 30న పాక్ నుంచి దిల్లీకి రానున్నారు మెుహిసిన్. మోదీపై ఉన్న ప్రేమ, అభిమానంతో గత 30సంవత్సరాలుగా మోదీకి కమర్ రాఖీ కడుతున్నారు. ఈ మేరకు కమర్ మొహిసిన్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ దీర్ఘాయువుతో,ఆరోగ్యంగా ఉండాలని తాను ప్రతిరోజూ ప్రార్థిస్తున్నానన్నారు.